శ్రీ గురు రవిదాస్ జీ మహారాజ్ జయంతి నిర్వహణ వాల్ Poster ను ఆవిష్కరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, జనవరి 12 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీ జగద్గురు సంతు శిరోమణి గురు రవిదాస్ జీ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా అఖిల భారతీయ రవి దాసీయ ధార్మిక సంఘటన సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీన జరిగే శ్రీ జగద్గురు సంత్ శిరోమణి గురు రవి దాస్ జి మహారాజ్ గ జయంతిని సందర్బంగా నిర్వాహకులు  చలో కాశీ క్షేత్ర పర్యటనకు రైలు బోగీని కేటాయించాలని చేసిన విజ్ఞప్తిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ రవిదాసియా ధార్మిక సంఘటన సమన్వయ కమిటీ ప్రచారక్ కమిటీ ప్రెసిడెంట్ ఆకేపోగు ప్రమోద్ మహారాజ్,సామాజిక వేత సిరాపు రామ్ చందర్, తెలంగాణ ఎస్సీ/ఎస్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ శివకుమార్, మహారాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సంబవాగే మారే, ప్రొఫెసర్ కిషోర్ వాంఖేడే, ఆనంద్ తమ్లుక్కర్, సంజీవ్ రావు , శ్యామ్ టాక్, పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....