షర్మిల ను అడ్డుకున్న పోలీసులు

 
హైదరాబాద్‌ ఆగష్టు 18, ఇయ్యాల తెలంగాణ; వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల రెడ్డి తలపెట్టిన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజక వర్గం పర్యటన  రద్దయింది.  శుక్రవారం నాడు జగదేవ్‌ పూర్‌ మండలం, తీగుల్‌ గ్రామంలో పర్యటించాల్సి వుంది. అయితే , ఉదయం 9 గంటలకు లోటస్‌ పాండ్‌ నివాసం నుంచి బయలు దేరటానికి బయటకు వచ్చిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దళిత బందు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్‌ గ్రామంలో  స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపధ్యంలో లోటస్‌ పాండ్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులతో వైఎస్‌ షర్మిల  వాగ్వాదానికి దిగారు. తన పర్యటనకు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా పోలీసులకు హారతి పట్టారు. సిఎం కేసీఆర్‌ తీరుకు నిరసన గా సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....