హరీష్‌కు డిప్యూటీ CM భట్టి కౌంటర్‌ !

హైదరాబాద్‌, జూన్‌ 19, (ఇయ్యాల తెలంగాణ) : హరీష్‌ రావు కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్‌ ఇచ్చారు. గత పదేళ్ళ పాలనను హరీష్‌ రావు మర్చిపోయారా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లో లా అండ్‌ ఆర్డర్‌ మా ఫస్ట్‌ ప్రేయారిటి అన్నారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్డడే వ్యక్తులను ఉక్కుపాదంతో అనిచివేస్తామన్నారు. బ్యాంకర్ల వార్షిక రుణప్రణాళిక ఆవిష్కరించారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలన్నారు. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్‌ అన్నారు. బ్యాంకర్స్‌ కు పాజిటివ్‌ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు అన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందన్నారు. 

వ్యవసాయ రంగానికి సంబంధించి చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెండిరగ్లో పెట్టదన్నారు. ఆయిల్‌ ఫామ్‌ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తుందన్నారు. సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమలకు ఎక్కువ రుణాలు ఇవ్వాలి అభి అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించేవన్నారు. బలహీన వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంది.. రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవన్నారు.రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చిన విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది ఉండదన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్‌ పాలసీని తీసుకురాబోతోందన్నారు. దేశ సంపద అన్ని వర్గాలకు సమానముగా పంచాలనేది రాహుల్‌ గాంధీ ఆలోచన అన్నారు. ఉమ్మడి కుటుంబం మాదిరిగా జాతి ఐక్యంగా ఉండాలని రాహుల్‌ గాంధీ విధానమన్నారు. అదే జాతికి ఆయన పిలుపు నిచ్చారన్నారు. దేశ సంపద అందరికి పంచాలని రాహుల్‌ గాంధీ విధానం అన్నారు.

 పెట్టుబడి దారులకు పంచడం బీజేపీ విధానమని కీలక వ్యాఖ్యలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు సంపదలో వాటా.. అధికారం లో వాటా ఉండాలి అనేది కాంగ్రెస్‌ విధానమని తెలిపారు. పెద్ద ప్రాజెక్టులు టెక్నీకల్‌ నాలెడ్జి ఉన్న వాళ్ళు కట్టాలన్నారు. వాళ్ళు కాదు నేనే కడతా అని కేసీఆర్‌ కడితే కాళేశ్వరం కూలిపోయిందన్నారు.పనిలేని వాళ్ళు కొందరు పనికి మాలిన మాటలు మాట్లాడతారి మండిపడ్డారు. పని లేక గాడిద పళ్ళు తోమారు అనే వాళ్ళు.. ఇప్పుడు అదే మాటలు మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం గురించి నిపుణులు సలహాలు మేరకు పనులు చేస్తామన్నారు. మేము చేసిన అప్పులో.. అప్పుల కోసం కట్టినవే ఎక్కువ అన్నారు. 36 వేల కోట్లు అప్పులకు కట్టిన్నామని తెలిపారు. బడ్జెట్‌ లో పొందుపరిచిన మేరకు అప్పులు తెస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ఎప్పుడు అనేది చూస్తున్నామని తెలిపారు. దాని ఆధారంగా బడ్జెట్‌ పెడతామన్నారు. జగదీశ్‌ రెడ్డి నే.. జ్యుడీషియల్‌ విచారణ అడిగారని తెలిపారు.

ప్రజాస్వామ్యం నమ్మే వాళ్లుగా? విచారణకు అదేశించామన్నారు. కక్ష సాధింపు కోసం వేసిన కమిషన్‌ కాదన్నారు. గతంలో విద్యుత్‌ శాఖ మంత్రిగా చేసిన ఆయనే విచారణ అడిగితే వేశామన్నారు. కమిషన్‌ ఎవరు ఉండాలని మేము వేసింది కాదు.. మాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మేము ఎవరం రోజు వారీ సవిూక్ష చేయడం లేదన్నారు. జ్యుడీషియల్‌ విచారణ తప్పు పెట్టాల్సిన అవసరం ఏముందని తెలిపారు. దిగిపో అనాల్సిన పనేముంది అని మండిపడ్డారు. వెళ్లి వివరాలు ఇవ్వచ్చుగా అన్నారు. ఎందుకు అంత భయపడుతున్నారని తెలిపారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రైతు బంధు వేయరు అనే ప్రచారం చేశారు.. కానీ వేసి చూపించామన్నారు. రుణమాఫీ మిలాగా నాలుగు సార్లు చేస్తామని.. అనలేదన్నారు. అందరూ మిలాగే ఉంటారని అనుకోకండి అన్నారు. మేము చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....