17న ఉజ్జయిని మహంకాళి బోనాలు – భారీగా ఏర్పాట్లు

హైదరాబావ్‌ జూలై 9, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కే పరిమితమైన బోనాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఈ నెల 17న నిర్వహించే సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, మహముద్‌ అలీతో కలిసి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సవిూక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా బోనాల ఉత్సవాల నిర్వహణ కొనసాగుతోందన్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ. 15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గతంలో కంటే అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తలసాని స్పష్టం చేశారు. 18న రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటుందని చెప్పారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....