170 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అత్యవసరంగా పొలాల్లో లాండిరగ్‌

మాస్కో సెప్టెంబర్‌ 13 (ఇయ్యాల తెలంగాణ );  రష్యాలో 170 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం అత్యవసరంగా పొలాల్లో దిగింది ఉరల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానం ఇవాళ నోవోసిబిర్స్క్‌ ప్రాంతంలో ఉన్న కామెనేకి గ్రామం వద్ద ఉన్న పొలాల్లో ల్యాండిరగ్‌ అయ్యింది. ఎయిర్‌పోర్టులో దించేందుకు ప్రయత్నం చేసినా.. ఆ విమానం రన్‌వే వరకు వెళ్లలేకపోయింది. దీంతో అత్యవసరంగా ఆ విమానాన్ని .. గోధుమ పొలంలోనే దించేశారు. ఎయిర్‌బస్‌ ఏ320 విమానం.. సోచి నుంచి ఓమ్స్క్‌కు వెళ్తోంది. మార్గమధ్యలో ఎమర్జెన్సీ సందేశం రావడంతో.. ఆ విమానాన్ని నోవోసిబిర్క్స్‌కు పంపే ప్రయత్నం చేశారు. కానీ ఆ విమానం మధ్యలోనే ల్యాండ్‌ అయ్యింది. నోవోసిబిర్క్స్‌కు సుమారు 180 కిలోవిూటర్ల దూరంలో దాన్ని దించారు. హైడ్రాలిక్స్‌ లోపం తలెత్తడంతో విమానాన్ని ల్యాండ్‌ చేశారు. 170 మందితో వెళ్తున్న ఆ విమానంలో 23 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఎమర్జెన్సీగా పొలంలో దిగినా.. ఆ విమానం ముక్కలు కాలేదు. అగ్నిప్రమాదం కూడా జరగలేదు. ప్లేన్‌ నుంచి ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయకు వచ్చారు. ఆ పోలాల్లోనే ప్రస్తుతం వాళ్లంతా ఎదురుచూస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....