19కి బెయిల్‌ పిటీషన్‌ వాయిదా

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (ఇయ్యాల తెలంగాణ ): మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ వాయిదా పడిరది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు రెండు పిటిషన్లు వేశారు. బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోర్టులో అభ్యర్థన పెట్టుకున్నారు. ఈ రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు.. వాదనలను 19వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ పిటిషన్‌ విచారణకు స్వీకరించిన టైంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ అంశాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. ఇప్పుడు మధ్యంతర బెయిల్‌ వస్తే క్వాష్‌ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కేసు నమోదు చేసి జైల్లో పెట్టారని బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్‌ వేశారు. కనీసం ఎప్‌ఐఆర్‌లో కూడా తన పేరు లేదని కోర్టుకు తెలియజేశారు. ఏపీఎస్‌డీసీ ఛైర్మన్‌ ఇచ్చిన ఫిర్యాదులో కూడా తన పేరు లేదని గుర్తు చేశారు. రాజకీయంగా ప్రతికారం తీర్చుకోవడానికే ఈ కేసులో ఇరికించారని దీన్ని పరిగణలోకి తీసుకొని బెయిల్‌ ఇవ్వాలని రిక్వస్ట్‌ పెట్టుకున్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....