199 వ జయంతి సందర్బంగా జ్యోతిరావు పూలేకు నివాళి !

హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) : భరతమాత ముద్దు బిడ్డ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే అని అఖిలభారత ముదిరాజ్ కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్  పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మహాత్మా జ్యోతి బా పూలే 199 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని వెంకటేశ్వర్ జ్యోతి బా పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అంటరానితనాన్ని రూపు మాపడానికి  జ్యోతి బా పూలే చేసిన సేవలు ఎనలేనివని  గుర్తు చేశారు. సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి  అయిన నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాల కనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ కోరారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....