4 న 57 SC ఉపకులాల ఆత్మగౌరవ సభ : గోడ పత్రిక విడుదల

వరంగల్, అక్టోబర్ 1 (ఇయ్యాల తెలంగాణ) :  హైదరాబాద్ లో ఈ నెల 4 వ తేదీన జరగబోవు 57 ఎస్సీ ఉపకులాల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయూలని, ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు  టి ఎల్  స్వామి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 29 నాడు ఆయన ఆధ్వర్యంలో  ఉపకులాల ఆత్మగౌరవ సభకి సంబందించిన గోడ పత్రికను నర్సంపేట లోని అంబేద్కర్ విగ్రహాం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టిఎల్ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఉపకుల జాతులు ఐక్యమై తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడవల్సిన అవసరముందన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జీల్లా వైస్ ప్రెసిడెంట్ సల్లా లక్ష్మన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి శ్యామ్ కూమార్. దేవరకొండ వీరయ్య,ప్రసాద్ ,రాకేశ్  ఆనంద్  శివక్రిష్ణ,బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....