
16 ఏళ్ల అత్యాచార బాధితురాలి శాపమే ఇరాన్ ని పట్టిపీడిస్తోందా? సోషల్ విూడియాలో జరుగుతున్న ప్రచారం ఎంతవరకూ కరెక్ట్? శాపాలు తగులుతాయా అసలు? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన కర్మ ఫలం అంటే ఇదేనా?16 ఏళ్ల అతేఫా సహాలేప్ా కి ఇరాన్ కోర్టు ఉరిశిక్ష విధించింది,అందరూ చూస్తుండగా బాలికను బహిరంగంగా ఉరితీశారు. ఆమె తప్పు చేయలేదు..పైగా బాధితురాలు.అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైందిజఆమెకు న్యాయం చేయాల్సిందిపోయి ఉరితీశారుఈ ఘటనతో ఇరాన్ దేశం మొత్తం అట్టుడికింది..ఇంత దారుణమా అని ప్రపంచ దేశాలన్ని బాలికకు మద్దతుగా గొంతెత్తాయి…రెండు దశాబ్ధాల క్రితం ఇరాన్ న్యాయస్థానం అమలు చేసిన ఉరిశిక్ష సంచలనం రేపిందిమళ్లీ ఇప్పుడు ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు నెటిజన్లు…నిండు సభలో ద్రౌపదిని అవమానించినందుకు ప్రతిగా కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. మహిళను అవమానించిన వారుమాత్రమే కాదు చూస్తూ ఊరుకున్నవారు కూడా అంతమైపోయారుమాయావిగా వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్లిన రావణుడికి, లంకేయులకు ఎలాంటి గతి పట్టిందో రామాయణంలో ఉందిఇప్పుడు ఆ బాలికకు జరిగిన అన్యాయమే..ఇరాన్ ను శాపమై పట్టిపీడిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఆ బాలికకు చేసిన అన్యాయానికి ఇన్నేళ్ల తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటోంది. ఇజ్రాయెల్ దాడులతో వందలమంది ఇరానియన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటే ఆ 16 ఏళ్ల బాలిక శాపమేనా అని సోషల్ విూడియాలో డిస్కషన్ జరుగుతోంది. 2004లో జరిగిన ఈ సంఘటన తర్వాత నుంచి ఇరాన్ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయంటున్నారు. ప్రస్తుత పరిస్థితి కూడా ఈ కోవకే చెందుతుందని ఆనాడు జరిగిన సంఘటనను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఇరాన్ లో నేకా నగరానికి చెందిన అతేఫా సహాలేప్ా కి పవిత్రతకు వ్యతిరేకంగా నేరం చేసిందంటూ మరణశిక్ష విధించారు. వాస్తవానికి ఇతర దేశాల్లో అత్యాచారానికి గురైతే బాధితురాలిగా పరిగణిస్తారు. కానీ ముస్లిం దేశం అయిన ఇరాన్ లో కన్యత్వాన్ని కోల్పోయినందుకు ఆమె దోషిగా నిలబడాల్సి వచ్చింది. కనీసం ఆమె ఆవేదన ఏంటో చెప్పుకునే అవకాశం కల్పించకుండానే నేరస్థురాలిగా తీర్మానించారు.
అప్పటికీ ఆమె హిజాబ్ తొలగించి తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేసింది కానీ దాన్ని కూడా తప్పుగా పరిగణించింది న్యాయస్థానం. ఉరిశిక్ష విధించడమే కాదు బహిరంగంగా అమలుపర్చారు.అతేఫా సహాలేప్ా చిన్నప్పుడే తల్లిదండ్రులను ఓ ప్రమాదంలో కోల్పోయింది. సోదరుడు నదిలో పడి చనిపోయాడు. అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగింది అతేఫా. కుటుంబ సభ్యులంతా కూలికోసం ఇంటికి దూరంగా వెళ్లాల్సి వచ్చేది. ఇంట్లో ఒంటరిగా ఉండేది 15 ఏళ్ల అతేఫా. ఇది గమనించాడు పక్కింట్లో ఉన్న 51ఏళ్ల అలీ. ఒంటరిగా ఉన్న ఆమెను అత్యాచారం చేయడమే కాదు ఈ విషయం ఎవరితో అయినా చెబితే చంపేస్తానని బెదిరించి వందలసార్లు శారీరికంగా హింసించాడు. ఆ బాధను భరించలేకపోయిన అతేఫా పోలీసులను ఆశ్రయించింది. ఇదే ఆమెకు శాపమైంది. కన్యత్వాన్ని పోగొట్టుకున్న మహిళ..షరియా చట్టం ప్రకారం బాధితురాలు కాదు నేరస్తురాలు. ఈ నేరం కిందే ఆమెను జైల్లో పెట్టారు. అక్కడ కూడా లైంగిక వేధింపులకు గురైంది అతేఫా సహాలేప్ా. ఈ విషయం న్యాయస్థానం వరకూ చేరింది కానీ ఆమెకు న్యాయం జరగలేదు సరికదా కన్యత్వాన్ని కోల్పోయిన నేరం కింద ఉరితీశారు. అతేఫా సహాలేప్ా ని ఉరితీసేనాటికి ఆమె వయసు 22 ఏళ్లని , వ్యభిచార నేరానికి పాల్పడిరదని కోర్టు చెప్పింది. కానీ ఆమె వయసు 16 సంవత్సరాలు అని కొందరి వాదన. ఇరానియన్ చట్టాల ప్రకారం 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవారిని ఉరితీయకూడదు. అతేఫా సహాలేప్ా విషాద గాధను ఓ వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అతేఫాను ఉరితీసినప్పటి నుంచీ ఇరాన్ ప్రజలకు శాంతి లేదని పోస్ట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇరాన్ లో పరిస్థితికి కూడా ఆ బాలిక శాపమే కారణం అనే చర్చ జరుగుతోంది. అతేఫా కథ విన్నవారంతా ఇదేం న్యాయం? ఇదెక్కడి చట్టం? ఇంత అన్యాయమా? ఆమె శాపం తగిలింది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు. శాపాలు, పాపాలు తగలడంలో వాస్తవం ఎంత అంటే ప్రూవ్ చేసే సాక్ష్యాలు లేకపోవచ్చేమో..కానీ చేసిన కర్మకు తగిన ఫలితం అనుభవించక తప్పదని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.
మరోవైపు శాంతి పరిస్థితులు ఏర్పడినందుకు ఇరాన్ మాత్రం అణ్వాయుధాల ప్రస్తావనే చేయొద్దని అమెరికా హెచ్చరించింది. ఇదే విషయాన్ని ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయలేదనే డోనాల్డ్ ట్రంప్ వాదనను ఇరాన్ అణుశక్తి సంస్థ తోసిపుచ్చింది. ఇరాన్ అణు కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు లేకుండా తిరిగి ప్రారంభమవుతుందని, యురేనియం సుసంపన్నతను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ యుద్ధ వాతావరణంతో ఇరు దేశాలు భారీగానే నష్టపోయాయి. 24 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోగా వెయ్యిమందికిపైగా గాయాలు పాలయ్యారు. ఆస్తినష్టం సరేసరి. 974 మంది ఇరానియన్లు మృతి చెందగా.. మూడు వేలకుపైగా ప్రజలు గాయపడ్డార. భారీగా ఆస్తులు ధ్వంసం అయ్యాయి. వీటికి తోడు వేల మంది విదేశీయులు అక్కడి నుంచి తరలిపోయారు. జ్రాయెల్` ఇరాన్ మధ్య పరిస్థితులు చక్కబడటంతో చాలా దేశాలు తమ గగన తలాలను తెరుస్తున్నాయి. గల్ఫ్ దేశాలన్నీ మంగళవారం ఉదయానికి సాధారణ విమాన సేవలు పునరుద్ధరించాయి. ఇరాన్తో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత, ఇజ్రాయెల్ రక్షణ దళం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు కార్యాలయాలపై విధించిన ఆంక్షలు ఎత్తివేసింది. ఇరాన్ కూడా తమ గగనతలాన్ని తిరిగి తెరిచింది. ఫ్లైట్`ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ 24 ప్రకారం విమానాలను అనుమతిస్తున్నారు.