బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణానికి ఆహ్వానం

హైదరాబాద్, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) :  బల్కంపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి రావాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కు ఎమ్మార్పీఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఆయనను కలసి ఆహ్వాన పత్రికను అందించారు.  పద్మశ్రీ వచ్చినందుకు శాలువాతో ఆయనను సత్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. బల్కంపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణానికి సకుటుంబ సమేతంగా హాజరు కావాలని మంద కృష్ణ ను కోరారు. ఆహ్వానం పలికిన వారిలో ఎమ్మార్పీఎస్ నాయకులు దళిత రత్న పొలిమేర  సంతోష్ కుమార్ మాదిగ నారాయణ సతీష్ రామేశ్వరం రమేష్ రాములు మరియు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....
Related Post