BJP MP – M. రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు !

హైదరాబాద్‌, జూన్‌ 13, (ఇయ్యాల తెలంగాణ) :  మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ ఎం. రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కేసు నమోదు చేశారని అన్నారు. కాసేపటి క్రితమే ఆ కేసు నమోదైందని అన్నారు. అనంతరం కేసీఆర్‌ ను విచారణ చేసేందుకు ఈడీ అధికారులు కూడా వచ్చినట్లు చెప్పారు. గొర్రెల కొనుగోలు వ్యవహారంలో ఈడీ ఈ కేసు నమోదు చేసిందని వ్యాఖ్యలు చేశారు. మెదక్‌ పట్టణ కేంద్రంలో జరిగిన దిల్‌ సే ములాఖాత్‌ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారుఅంతకుముందు మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం హవెలి ఘన్పూర్‌ మండలం ముత్తాయిపల్లి శివాలయంలో కూచానపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రఘునందన్‌ రావు పూజలు చేశారు. తర్వాత మెదక్‌ పట్టణంలో పంచముఖి హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు.      

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....