CELL PHONE దొంగల అరెస్టు

హైదరాబాద్‌ జులై 11 (ఇయ్యాల తెలంగాణ ); సెల్ఫోన్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను లంగర్‌ హౌస్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం సాజిత్‌, సయ్యద్‌ హుస్సేన్‌, సయ్యద్‌ వాలిద్‌ హుస్సేన్‌ ఈ ముగ్గురు ఆటోను తీసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారని దొంగలించిన సెల్‌ ఫోన్‌ లను నిజామాబాద్‌ లోని సైయద్‌ రెహమతుల్లాకు అమ్ముతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు… వారి వద్ద నుండి సుమారు 30 సెల్‌ ఫోన్‌ లోనూ స్వాధీనం చేసుకున్నారు. ఒకరు ఆటో నడిపిస్తుంటే ఇద్దరు నిందితులు ఆటో వెనుకాల కూర్చుని వారు కూడా ప్యాసింజర్లల వ్యవహరిస్తూ మాయమాటలు చెప్పి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు…. మహమ్మద్‌ సాజిద్‌ కు రిసీవర్‌ జైల్లో పరిచయం అయినట్లు పోలీసులు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....