CITY లో మరిన్ని ELECTRIC SERVICE

హైదరాబాద్‌, ఆగస్టు 29, (ఇయ్యాల తెలంగాణ );హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఎంఎంటిఎస్‌, మెట్రో రైలు సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాలకు ఎలక్ట్రికల్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిందిహైదరాబాద్‌లో పలు ప్రాంతాలకు ఎలక్ట్రికల్‌ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురావాలని టిఎస్‌ ఆర్టీసి నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్‌ ఆర్టీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్‌, మెట్రో రైలు సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, మియాపూర్‌ ఆర్టీసీ డిపోల పరిధిలో ఈ బస్సులను నడిపాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్‌ ? పంజాగుట్ట ? జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు ? ఫిల్మ్‌ నగర్‌ ? ఉస్మానియా కాలనీల విూదుగా మణికొండ వరకు ఈ సర్వీసులు నడపాలని నిర్ణయించారు.సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి జూబ్లీ బస్‌ స్టేషన్‌, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్‌, ఎల్‌బీ నగర్‌, ఇబ్రహీంపట్నం వరకు నడపాలని నిర్ణయించారు.మియాపూర్‌ డిపో పరిధిలో బాచుపల్లి ? జేఎన్‌టీయూ ? కేపీహెచ్‌బీ ? హైటెక్‌ సిటీ ? బయోడైవర్సిటీ ? గచ్చిబౌలి ? వేవ్‌ రాక్‌ ? ప్రగతి నగర్‌ ? జేఎన్‌టీయూ, వీబీఐటీ వరకు ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఎలక్ట్రిక్‌ బస్సులన్నింటికి జిపిఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను అమర్చుస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి 30 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉండే విధంగా బస్సులను నడపనున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....