హైదరాబాద్, సెప్టెంబర్ 17 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ అసెంబ్లీ ఉప సభాపతి టి . పద్మా రావు గారు ఆయన బీఆర్ఎస్ యువనాయకులు రామేశ్వర్ గౌడ్ గార్ల ఆధ్వర్యములో మట్టి గణేశుల పంపిణీ జరిగింది. సికింద్రాబాద్ నియోజక వర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో తెనాలి డబుల్ హార్సు మినపగుండ్లు వారు తయారు చేసిన మట్టిగణేశులు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ హితానికి మట్టి వినాయకులే శ్రేష్ఠమైనవని పజ్జన్న అభిప్రాయం వక్తం చేశారు. ఈ కార్యక్రమములో రాజీవ్ గుప్త, డబుల్ హార్సు రీజినల్ మేనేజర్ ప్రవీణ్ గౌడ్, ఏ ఆర్ క్రిష్ణ మెట్టుగూడా డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు, గుండవేణి రాజేశ్ గౌడ్ పెద్దన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, యామ శ్రీనివాస్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.