Election సిబ్బందిపై లాఠీచార్జి అన్యాయం


👉
ఎన్నికల సిబ్బంది పై లాఠీచార్జి అన్యాయం

👉ఉద్యోగ ఉపద్యాయుల ఆత్మగౌరవం కు భంగం కలిగించే చర్య

👉రెమ్యూనరేషన్‌ చెల్లింపు లో తేడా లేకుండా చూడాలి

👉ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్‌ అందరికి అందేలా చూడాలి

జగిత్యాల, మే 14 (ఇయ్యాల తెలంగాణ) : భారతదేశ పద్దెనిమిదవ పార్లమెంట్‌ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు నిబంధనల ప్రకారం రెమ్యూనరేషన్‌ చెల్లించాలని అడిగినందుకు ఉపాధ్యాయులపై సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ ఖేడ్‌ లో లాఠీచార్జి చేయడం దారుణమని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి గంగధారి మహేష్‌, సర్వ సతీశ్‌ ,గొల్లపల్లి మహేష్‌ గౌడ్‌ లు సంయుక్తంగా మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు..

పార్లమెంట్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులపై లాఠీచార్జి చెయ్యడం అనేది ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న ఓడ దిగాక బోడి మల్లన్న అనే సామెత ను నిజం చేసినట్లు గా ఉందని ఎన్నో వ్యయప్రయసాలను ఇబ్బందులను ఎదుర్కొని 1951 సంవత్సరం నుండి నేటి వరకు ప్రతి ఎన్నికల ను విజయవంతం చేయుట లో ఉద్యోగ,ఉపాధ్యాయుల కృషిని అభినందించాల్సిన చోట లాఠీలతో దెబ్బలు కొట్టించడం దారుణం అని చర్యగా ఆయన అభివర్ణించారు.

 వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జరిగిన సంఘటన పై విచారణ చేసి బాద్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించిన వారికి ఒకే విధమైన

రెమ్యూనరేషన్‌ చెల్లింపు లో జరిగిన పొరపాట్ల ను సరిచేయలని,సిబ్బంది అందరికి డ్యూటీ సర్టిఫికెట్‌ అందేలా చూడాలని,అలాగే భవిష్యత్‌ లో ఎన్నికల నిర్వహణ ఎలా ఉంటే బాగుంటుందని ప్రస్తుతం జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్ల పై అన్ని స్థాయిలోని సిబ్బంది తో సవిూక్ష చెయ్యాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్‌ కుమార్‌,బోగ శ్రీనివాస్‌, జనార్దన్‌,

విరబత్తిని శ్రీనివాస్‌, బండారి సతీశ్‌,వంశీ, రవి,సుధాకర్‌, శంకర్‌,సాయిరెడ్డి,అభయ్‌ రాజ్‌,శ్రీనివాస్‌,విజయ్‌,నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....