Government Job కోసం భర్తను చంపిన భార్య

నల్లగొండ మార్చి 12

 ప్రభుత్వం ఉద్యోగం కోసం భర్తను భార్య చంపి అనంతరం అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం? నల్లగొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో మహ్మద్‌ ఖలీల్‌(44), తన భార్య అక్సర్‌ జహ, తల్లి మహ్మద్‌ బేగం, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఖలీల్‌ కనగల్‌ మండల పరిధిలోని చర్లగౌరారంలో పాఠశాలలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జవనరి 25న అతడికి మూర్ఛ రావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు.అక్సర్‌ జహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. తల్లి మహ్మద్‌ బేగం తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు తెలిపింది. పోస్టుమార్టమ్‌లో బలమైన గాయంతో చనిపోయినట్ట తేలడంతో మహ్మద్‌ బేగంను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. వివాహం జరిగి 18సంవత్సరాలు అవుతుందని, ఖలీల్‌ మద్యానికి బానిసగా ప్రతీరోజు వేధిస్తున్నాడుని, వేధింపులు శృతి మించడంతో అడ్డు తొలిగించుకోవాలని నిర్ణయం తీసుకన్నాడు. అతడు చనిపోతే ప్రభుత్వం ఉద్యోగం తన కుమారుడికి వస్తుందని నమ్మకంతో అతడి తలపై సుత్తెతో బాదడంతో మృతి చెందాడని పోలీసులకు వివరించింది. పోలీసులు భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....