Govt అభివృద్ధి పనులకు ఇసుక కేటాయించాలి

జయశంకర్‌ భూపాలపల్లి,  జూన్ 05 (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వ అభివృద్ధి పనులకు,  నిర్మాణాలకు ఇసుక  తరలింపుకు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా కాటారం మండలంలోని విలాసాగర్‌ గ్రామ సవిూపంలోని మానేరు నది ఇసుక రీచ్‌ ను పరిశీలించారు.  ఈ సందర్బంగా ఆయన  సంబందిత అధికారులతో మాట్లాడుతూ కాటారం మండలంలోని పలు ప్రభుత్వ అభివృద్ధి పనుల రీత్యా ఇసుక రవాణా కోసం విలాసాగర్‌ గ్రామ సవిూపంలోని మానేరు నది నుండి ఇసుక రవాణాకు అవకాశం ఇవ్వాలని అన్నారు.   5 హెక్టార్ల కు గాను నీటి సామర్ధ్యాన్ని పరిశీలించి  నివేదికలు అందచేయాలని భూ గర్భ జలవనరుల శాఖ అధికారిని  ఆదేశించారు . ఇందుకు గాను మొత్తం 12.5 ఎకరాలకు ఒక బౌండరిని ఏర్పాటు చేయాలని ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.   ఏదైనా కాంట్రాక్ట్‌  పనులకు గాని ఇతరత్రా ప్రయివేట్‌ నిర్మాణాలకు కానీ ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చినా, అక్రమంగా  ఇసుక రవాణా  చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను  ఆదేశించారు. నూతన  ఇసుక రీచ్‌ లు ఏర్పాటుకు  కావలసిన అనుమతులు, ఈసి లను సిద్ధం చేసి త్వరితగతిన నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో మైనింగ్‌ అధికారి జయరాజు, భూ గర్భ జలవనరుల అధికారి  శ్రీనివాసరావు, కాటారం తహసిల్దార్‌ నాగరాజు,  ఇరిగేషన్‌ ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....