ఘనంగా బ్రాహ్మణి ముత్యాలమ్మ తల్లి పండగ మహోత్సవం
` అన్నసమారాధన కార్యక్రమంలో భారీగా పాల్గొన్న భక్తులు
పరవాడ, మే 23 (ఇయ్యాల తెలంగాణ) : మండల కేంద్రం అయ్యిన పరవాడ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ బ్రాహ్మణి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి పండగ మహోత్సవం గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి పురోహితులుచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ధర్శనం కోసం వచ్చిన భక్తులు కోసం ప్రత్యేకంగా ప్రసాదాలు ఏర్పాటు చేశారు అలాగే మధ్యాహ్నం అమ్మవారు ఆలయం వద్ద భక్తుల సహాయంతో భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం గ్రామంలో అమ్మవారి ప్రతిమను భారీ మందుగోడు సామాగ్రితో గ్రామ పురావిధిలలో ఊరేగించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పయిల రామచంద్రరావు,చీపురుపల్లి సన్యాసిరావు,పిల్లా జగదీష్,పయిల సన్యాసి నాయుడు, అక్కునాయుడు,సింహాచలం నాయుడు,రాజాన సత్యం తదితరులు పాల్గొన్నారు.