Hyderabad నగరంలో లక్ష దాటిన బంగారం

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఇయ్యాల తెలంగాణ) :  హైదరాబాద్‌ నగరంలో బంగారం ధరలు ఆకాశాన్నంటు తున్నాయి. సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.1,00,110 కి చేరింది. ఇది బంగారం ధరల చరిత్రలోనే అత్యధికమని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్‌ 22వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,015 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. ఇప్పుడు ఆ రికార్డును కూడా అధిగమించి పసిడి ధర కొత్త శిఖరాలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువలో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా`డిమాండ్‌ మధ్య ఉన్న వ్యత్యాసం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులు వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కారణంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి. అంతేకాకుండా, చాలామంది బంగారాన్ని దీర్ఘకాలిక సురక్షితమైన పెట్టుబడిగా భావించడం కూడా అధిక కొనుగోళ్లకు కారణమైంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....