Hyderabad లో 8 మంది Fake డాక్టర్లు

తనిఖీల్లో గుర్తించిన TGMC.!

హైదరాబాద్‌, జూలై 07 (ఇయ్యాల తెలంగాణ) : అర్హత లేకుండానే వైద్యం చేస్తున్న 8 మంది ఫేక్‌ డాక్టర్లను గుర్తించామని, వారిపై ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ అధికారులు వెల్లడిరచారు.హైదరాబాద్‌ సిటీలోని బౌరంపేట్‌, దుండిగల్‌, సూరారం ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు.. యాంటీ బయాటిక్స్‌, స్టెరాయిడ్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌, ఐవీ ఫ్లూయిడ్స్‌ వంటి అధిక స్థాయి మందులను రోగులకిచ్చి హాని కలిగిస్తున్నారు.సమాచారం అందుకున్న టీజీఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరెంజ్‌ క్లినిక్‌ ఎస్‌ కే. నగులవిూరా, బీఎల్‌ఆర్‌ క్లినిక్‌ డా. పి. సూర్యలత, నాని మినీ హాస్పిటల్‌ కె. వెంకటేశ్‌, శ్రీ సాయి ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ వై. సూర్యనారాయణ, శ్రీ శ్రీనివాస ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ శివ శంకర్‌, బాలాజీ క్లినిక్‌ చి. విట్టల్‌, నందుశ్వర్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ శంకర్‌ గౌడ్‌, మస్తాన్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌  ఎస్‌.కె మస్తాన్‌, సెంటర్లపై టీజీఎంసీ వైస్‌ చైర్మన్‌ డా. జి. శ్రీనివాస్‌, సభ్యుడు డా. విష్ణు బృందాలు దాడులు నిర్వహించాయి. అనంతరం నిందితులపై ఎన్‌ఎంసీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు చెప్పారు. నకిలీ వైద్యుల సమాచారం తెలిస్తే వాట్సప్‌ నంబర్‌ 91543 82727 ద్వారా తెలియచేయాలని ప్రజలను కోరారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....