Inter, Tenth, పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నాగర్‌ కర్నూల్‌, ఫిబ్రవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు,అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సవిూక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇంటర్మీడియట్‌,పదవ తరగతి వార్షిక పరీక్షలలో విద్యార్థులు  ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి భరోసా కల్పించాలని అన్నారు.  ఈ నెల 28 నుండి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అలాగే, పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుండి ఏప్రిల్‌ 02 వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయని వివరించారు. ఇంటర్‌ పరీక్షలకు మొదటి సంవత్సరం 6,837 విద్యార్థులు, రెండవ సంవత్సరం విద్యార్థులు,7,034,మొత్తం (13,871) మంది విద్యార్థులు  హాజరు కానుండగా, 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, పదవ తరగతి పరీక్షలకు, బాలురు, 5227 బాలికలు,5332, మొత్తం (10,559) మంది విద్యార్థులకు గాను 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. గ్రావిూణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారి కి  సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్‌ కో అధికారులను ఆదేశించారు.

నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరాలన్నారు. పరీక్షలు ప్రారంభం అయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, తెలిపినారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్‌ సెంటర్‌ లను మూసి వేయించాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలని, తగిన సంఖ్యలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను ఎగ్జామ్‌ సెంటర్లలో నియమిస్తూ, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య అధికారి కి సూచించినారు. పరీక్షాల   సమయంలో విద్యుత్‌ సరఫలో అంతరాయం కలుగాకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రావిూణ ప్రాంతం నుండి వచ్చే విద్యార్థులకు సమయానికి ముందే బస్సుల సమయాలను రీ షెడ్యుల్‌ చేయాలని ఆర్టీసి అధికారులను అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, ఆదేశించారు. జవాబు పత్రాలను పార్శిల్‌ చేయడానికి పోస్టల్‌ అధికారులు సహకరించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు.

 మాస్‌ కాపీయింగ్‌ కు ఆస్కారం లేకుండా సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించి, కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్‌, సూచించారు.

ఈ సవిూక్షా సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ రామేశ్వర్‌, ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి వెంకటరమణ, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ ఎం గోవిందరాజులు, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్‌ రావు, జిల్లా రవాణా అధికారి చిన్న బాలు, డిపిఓ కృష్ణ, డిపిఆర్‌ఓ కిరణ్‌ కుమార్‌, నాగర్‌ కర్నూల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ నరేష్‌ బాబు, కలెక్టరేట్‌ ఏ ఓ చంద్రశేఖర్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....