IRAN పై ప్రతీకార దాడికి దిగిన Pakistan

న్యూ డిల్లీ జనవరి 18 (ఇయ్యాల తెలంగాణ) : పాకిస్థాన్‌ లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని పాక్‌ తీవ్రంగా ఖండిరచింది. తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ దిశగా చర్యలు తీసుకుంది.ఇరాన్‌పై గురువారం ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్‌ భూభాగంలోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ లో గల సరవన్‌ నగరానికి సవిూపంలో ఉన్న ‘బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌’, ‘బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ’ స్థావరాలపై పాక్‌ గురువారం వైమానిక దాడులు చేసినట్లు స్థానిక విూడియా వెల్లడిరచింది.పాకిస్థాన్‌లోని జైష్‌`అల్‌`అదల్‌ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం ఇరాన్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించి దాడికి దిగింది. అయితే ఇరాన్‌ దాడులను పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండిరచింది. దాడిలో ఇద్దరు అమాయక పిల్లలు చనిపోయారని, మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని వెల్లడిరచింది. ఇది పాకిస్థాన్‌ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే నని, ఈ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....