లాల్‌ దర్వాజ Temple లో ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌, జూన్ 28 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాసం బోనాల ఉత్సవాల పురస్కరించుకొని చారిత్రాక్మతమైన లాల్‌ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి దేవాలయం అధ్యక్షుడు మారుతి యాదవ్‌ ఆధ్వర్యంలో  అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీల నడుమ గోల్కొండ కోట పై శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయానికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యంతో బయలుదేరారు. ఈ సందర్భంగా మారుతి యాదవ్‌ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలు చరిత్ర కలిగిన గోల్కొండ జగదాంబ అమ్మవారికి మా తొలి బోనం సమర్పించడం ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో లాల్‌ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....