Lift నుంచి పడి పూజారి మృతి !

సికింద్రాబాద్‌, జూలై 02 (ఇయ్యాల తెలంగాణ) : సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మారేడ్‌ పల్లిలో విషాదం జరిగింది. లిఫ్ట్‌ నుండి పడి పూజారి  మృతి చెందాడు. తుకారాంగేట్‌ పీఎస్‌ పరిధిలో ఘటన జరిగింది. మారేడ్‌ పల్లి లోని డీ ప్రీతం ఇంట్లో పూజ నిర్వహించడానికి పూజారి నర్సింహా మూర్తి వచ్చారు. లిఫ్ట్‌ రాక ముందే గేట్‌ తెరచి అందులోకి ప్రవేశించి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....