మైత్రి Movie మేకర్స్‌ ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా, మహేష్‌ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

తాజా షూటింగ్‌ షెడ్యూల్‌ ఈరోజు రాజమండ్రిలో ప్రారంభమైంది. రామ్‌ పోతినే, కన్నడ స్టార్‌ ఉపేంద్రలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన కథాంశంలో రామ్‌ డై హార్డ్‌ అభిమాని పాత్రను పోషిస్తుండగా, ఉపేంద్ర సూపర్‌ స్టార్‌ గా పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ టైటిల్‌ గ్లింప్స్‌ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

లేటెస్ట్‌ సెన్సేషన్‌ భాగ్యశ్రీ బోర్సే రామ్‌ సరసన కథానాయికగా నటిస్తోంది. టాప్‌ టెక్నిషియన్స్‌ తో ఈ ప్రాజెక్ట్‌ అత్యున్నత స్థాయి సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ఇవ్వబోతోంది. సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్‌గా పని చ్దేస్తున్నారు. వివేక్‌`మెర్విన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటర్‌. ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా.

ట్యాలెంటెడ్‌ స్టార్‌ కాస్ట్‌, అద్భుతమైన కథాంశం, హై ప్రొడక్షన్‌ వాల్యూస్‌ తో ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

తారాగణం: రామ్‌ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్‌, మురళి శర్మ, సత్య, రాహుల్‌ రామకృష్ణ, పుప గణేష్‌  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....