ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న MEPMAA లు

మహబూబ్‌ నగర్‌,  మే 21 (ఇయ్యాల తెలంగాణ) :   మెప్మా పరిధిలోని సహాయక సంఘాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.మున్సిపాలిటీల పరిధిలో ఉం డే పొదుపు సహాయక సంఘాల సభ్యుల లె క్కలు పద్దులు చూసేందుకు ప్రభుత్వం ఆర్పీలు ( రిసోర్స్‌ పర్సన్లు) ఏర్పాటు చేసిం ది.  ఆర్పీలు మహిళా సంఘాల సభ్యులకు లోన్లు అందజేయాల్సి ఉన్నది.అయితే ఆర్పీ లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. 50వేల రు ణాలు ఇవ్వాల్సిన చోట లక్ష రూపాయల వరకు కూడా ఇ చ్చి తాము ఆ డిరదే ఆట పా డిరది పాటగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్లో పలువురు ఆర్పి లపై ప్రజావాణిలో ఫిర్యాదులు సైతం చేయడం జరిగింది. మహబూబ్నగర్‌ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో 135 మంది ఆర్పీలు ఉన్నారు. ఇలా ఉ మ్మడి పాలమూరు జిల్లాలో 451  మంది పైగా ఆర్పీలు ఉన్నారు. పేదరిక నిర్మూలన కార్యక్రమం లో భా గంగా మహిళా సంఘాల కు వడ్డీలేని రుణా లు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన మెప్మ జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వం  భాదేపల్లి లో  23 మంది ఆర్‌.పి లను నియమించినది. మహిళా సంఘాల కు బ్యాంక్‌ ల ద్వారా రుణాలు ఇప్పించేపనికి ఈ సదరు ఆ ర్‌.పి లు లోన్లు ఇప్పించి లంచవతారం ఎత్తుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నా యి.నిరుపేదలైన మహిళలు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆర్‌.పి ల ద్వా రా రుణాలు మంజూరు చేయాలని వాళ్ల ఇండ్ల చుట్టూ తిరుగుతూ ఉంటే లక్షకు రూ.2 నుంచి 5000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలా కాకుండా మొత్తం గా  కో టి రూపాయల లోన్‌ కు ఒక రేట్‌ ఫిక్స్‌ చేసి డబ్బు వసూలు చేస్తున్నట్లు మహి ళా సభ్యులు ఆరోపిస్తున్నారు. మహిళా సాధికారత కో సం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెప్మా ఉద్దేశం నీరుగారిపోయింది. ఆర్‌. పి లకు నెలకు 6000 జీతంతో పాటు 1500 గౌరవ వేతనంగా మహిళా సంఘాల నుండి తీసుంటూనే ఇలా చేయడంపై మహి ళా సంఘాల సభ్యులు దుమ్మెత్తి పోస్తున్నారు. కోట్ల రూపాయల మహిళా సంఘా లకు ఇప్పించే రుణాల కోసం లంచాలు లాగుతున్నారు.ఇదే విషయమై ఆర్పీలపై టౌన్‌ కోఆర్డినేటర్లు జిల్లా కో ఆర్డినేటర్లకు ఫిర్యాదు చేసిన ఫలితం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం మారినా ఈ ఆర్‌పిలపని తీరు మారడం లేద ని మహిళా పొదుపు సంఘాలు మండి పడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అడ్డదారులు తొక్కుతున్న ఆర్పీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....