MIM కార్పొరేటర్‌ కార్యాలయంలోయువకుడిపై కత్తులతో దుండగుల దాడి

హైదరాబాద్‌ డిసెంబర్‌ 19 (ఇయ్యాల తెలంగాణ) : పాత నగరంలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లలిత్‌భాగ్‌ లో లలితాబాగ్ కార్పొరేటర్‌ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లలితాభాగ్‌కు చెందిన ఏఐఎంఐఎం కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, అతని మేనల్లుడు సయ్యద్‌ ముక్తాజాపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన ముక్తాజాను పలువురు ఓవైసీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ సోదరి కొడుకే ముక్తాజా. మృతుడు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాడు. అయితే, స్నేహితుల మధ్య గొడవే ఈ హత్యకు కారణమని తెలుస్తున్నది. కార్పొరేటర్‌ కార్యాలయంలో ఉండగానే ఏకకాలంలో దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తులు కలిసి ముర్తుజాపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వెంటనే సయ్యద్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....