Nampally దర్గా జలమయం

హైదరాబాద్‌, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) : చారిత్రాత్మక నాంపల్లి యూసుఫియన్‌  దర్గా లో వర్షపు నీరు నిండిరది.  భారీ వర్షానికి మోకాలు దాకా నీళ్లు రావడంతో భక్తులు నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఎప్పుడు లేని విధంగా వర్షం నీళ్ళు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నుండి కోట్ల రూపాయలు విరాళాలు పొందుతూ…కనీస వసతులు లేకపోవడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. వక్ఫ్‌ బోర్డు నుంచి వచ్చిన నిధులు , భక్తుల విరాళాలు ఇలా కోట్ల రూపాయలు నిర్వహకులు మింగేస్తున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయలు దండుకుంటున్న నిర్వాహకులు…ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....