OCTOBER 3వ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ELECTION COMMISSON

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 20 (ఇయ్యాల తెలంగాణ );  రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అక్టోబర్‌ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈసీఐకి చెందిన సీనియర్‌ అధికారులు సుమారు మూడు రోజులు పాటు తెలంగాణలో ఎన్నికల సంసిద్ధతపై అంచనాలు చేయనున్నారు. రాజకీయ పార్టీలు, సెక్యూర్టీ దళాలు, స్థానికులతో పాటు ఇతర స్టేక్‌హోల్డర్స్‌తో ఎన్నికల సంఘం అధికారులు చర్చించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం సవిూపిస్తున్న నేపథ్యంలో.. ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని ఈసీఐ అంచనా వేయనున్నది.2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై అక్టోబర్‌ ఆరో తేదీన ఈసీ ప్రకటన చేసింది. నవంబర్‌ 12న నోటీఫికేషన్‌ జారీ చేశారు. డిసెంబర్‌ 11వ తేదీన పోలింగ్‌ జరిగింది. ప్రస్తుత అసెంబ్లీ కాలం జనవరి 17వ తేదీన ముగియనున్నది. ఎన్నికల నిర్వహణకు చెందిన అన్ని అంశాలను ఈసీ బృందం పర్యవేక్షించనున్నది. కొన్ని పనులు పూర్తి చేయడానికి వాళ్లు డెడ్‌లైన్‌ విధించే అవకాశాలు ఉన్నాయి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....