Old city లో శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు !

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఇయ్యాల తెలంగాణ) :  శివరాత్రి పండుగను పురస్కరించుకొని పాతనగరంలోని ఆలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి బుధవారం తెల్లవారు జామునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటికీటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లను కొనసాగించారు. అభిషేకాల కోసం నిలబడిన భక్తుల క్యూ లైన్లు కిక్కిరిసి కనిపించాయి. గౌలిపుర, లాల్ దర్వాజా, ఛత్రినాక, ఉప్పుగూడ, చార్మినార్ తదితర ప్రాంతాలలోని ఆలయాలలో భక్తులు కిక్కిరిసి కనిపించారు. గౌలిపురా బతుకమ్మ బావి సమీపంలోని రాజ రాజేశ్వరి ఆలయంలో ధర్మకర్త శేషాద్రి అయ్యంగార్ ఆధ్వర్యంలో సుందర్ అయ్యంగార్, ఆది తదితరాలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిత్రగుప్త దేవాలయం, ఛత్రినాక లక్ష్మణేశ్వర ఆలయంతో పాటు అలియాబాద్, లాల్ దర్వాజా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చార్మినార్ లోని శివ మందిర్ లో త్రివేణి సంగమం, కుంభమేళా దృశ్యాలు ఏర్పాటు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించుకున్నారు.    

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....