Pakistan కు తలనొప్పిగా మారిన బెలూచిస్తాన్‌

లాహోర్‌,  మే 16, (ఇయ్యాల తెలంగాణ) :  పాక్‌కు బలూచ్‌ ఆర్మీ మరింత తలనొప్పులు తెస్తోంది. పాకిస్తాన్‌ చేతుల్లో నుంచి బలూచిస్తాన్‌ జారిపోతోంది.  వరుస దాడులతో పాక్‌ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. గత కొన్ని రోజులుగా బలూచిస్తాన్‌లో నాన్‌స్టాప్‌ వార్‌ జరుగుతోంది. పాక్‌ సైన్యాన్ని బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ తరుముతోంది. బలూచిస్తాన్‌లో పలు చోట్ల పాక్‌ ఆర్మీపై  దాడులు చేస్తోంది. పాక్‌ పోలీస్‌ స్టేషన్లను స్వాధీనం చేసుకుని, హైవేలను నిర్బంధించింది. పాకిస్తాన్‌ పోలీసులను ఖైదు చేసింది. పాక్‌ ఆర్మీ ఇన్‌ఫార్మర్లను  ఫైటర్లు అదుపులోకి తీసుకుంటున్నారు. పాక్‌ బలగాలపై ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. బాంబులతో పాక్‌ ఆర్మీ వాహనాలను పేల్చివేస్తున్నారు.కోటిన్నర జనాభా ఉన్న బెలూచిస్తాన్‌.. పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రాంతం. బొగ్గు. బంగారం లాంటి ఖరీదైన ఖనిజ నిక్షేపాలతో పాటు సహజవాయు నిల్వలు అపారంగా ఉన్నా.. తమకు ప్రయోజనాలు దక్కడం లేదనేది స్థానికుల వాదన. పైగా.. పాకిస్తాన్‌ ప్రభుత్వం తమపై రాజకీయంగా కక్ష తీర్చుకుంటోందన్న ఆవేదన. వీళ్ల కడుపుమంట నుంచి పుట్టిందే బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ.. బీఎల్‌ఏ. పాకిస్తాన్‌ నుంచి విడదీసి బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలన్న డిమాండ్‌తో పాతికేళ్ల కింద ఏర్పాటైన వేర్పాటువాద సంస్థ. పాకిస్తాన్‌`ఇరాన్‌ మధ్య విభజించిన ఇరానియన్‌ జాతి సమూహం. బలూచ్‌`నివాస ప్రావిన్సులు కేంద్ర ప్రభుత్వాలకు నిరంతరం ఇబ్బందులకు కారణమవుతున్నాయి. సాయుధ స్వాతంత్య్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.పుట్టింది ఆఫ్ఘన్‌ నగరం కాందహార్‌లో.. నలుగురితో మొదలై ఇప్పుడు 600 మంది సాయుధులతో మిలిటెంట్‌ ఆర్గనైజేషన్‌గా ఎదిగింది.

మొదట్లో ఆఫ్ఘన్‌ నుంచే ఎటాకింగ్‌ షురూచేసేది. తర్వాత పాకిస్తాన్‌ లోపలికి జొరబడి బెలూచ్‌ నడిగడ్డ విూద నుంచే సవాల్‌ విసురుతోంది. ఇప్పుడు పాకిస్తాన్‌ మిలిటరీకి సమఉజ్జీగా మారి.. ఆ దేశ పాలకుల కంట్లో నలుసుగా మారింది. పాకిస్తాన్‌ ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల్లో అత్యంత కీలకమైంది బెలూచ్‌ తిరుగుబాటు బెడద. ‘’పాకిస్తాన్‌ ఒక వికృతమైన భావజాలమున్న న్యూక్లియర్‌ కంట్రీ.. ఐసిస్‌ లాంటి గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ నెట్‌వర్క్‌కు పాలు పోసి పెంచుతోంది.. ఈ మొత్తం ప్రోగ్రామ్‌ ఐఎస్‌ఐ కనుసన్నల్లోనే డిజైనౌతోంది.. మేమైతే సైలెంట్‌గా చూస్తూ కూర్చునేవాళ్లం కాదు? 51 చోట్ల 71 సార్లు దాడులు చేశాం.. ఇప్పుడే సినిమా ఐపోలేదు..’’ అని పాకిస్తాన్‌ ఒరిజినల్‌ షేప్‌ను ప్రపంచానికి చాటి చెబుతోంది బెలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ.అది 1540 సంవత్సరం, భారతదేశపు మొట్టమొదటి మొఘల్‌ పాలకుడు బాబర్‌ కుమారుడు హుమాయున్‌, బీహార్‌కు చెందిన షేర్‌ షా సూరి చేతిలో ఓడిపోయాడు. హుమాయున్‌ భారతదేశం నుండి పారిపోయాడు. అతను పర్షియాలో అంటే ఇరాన్‌లో ఆశ్రయం పొందాడు. షేర్‌ షా సూరి 1545లో మరణించాడు. అవకాశాన్ని గ్రహించి, హుమాయున్‌ భారతదేశానికి తిరిగి రావాలని ప్రణాళిక వేయడం ప్రారంభించాడు. అప్పుడు బలూచిస్తాన్‌ గిరిజన నాయకులు ఈ ప్రణాళికలో అతనికి సహాయం చేశారు. బలూచ్‌ల మద్దతుతో, హుమాయున్‌ 1555లో ఢల్లీిపై తిరిగి నియంత్రణ సాధించాడు.1659 సంవత్సరం. మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఢల్లీి పాలకుడు అయ్యాడు. అతని అధికారం పశ్చిమాన ఇరానియన్‌ సరిహద్దు వరకు విస్తరించింది. కానీ దక్షిణాన అతను నిరంతరం మరాఠాల నుండి సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. మరోవైపు బలూచి అధిపతులు మొఘల్‌ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. బలూచి నాయకుడు విూర్‌ అహ్మద్‌ 1666లో ఔరంగజేబు నుండి బలూచిస్తాన్‌లోని రెండు ప్రాంతాలు ? కలాట్‌, క్వెట్టాను స్వాధీనం చేసుకున్నాడు. నేడు బలూచిస్తాన్‌ ఉన్న ప్రదేశం చరిత్ర దాదాపు 9 వేల సంవత్సరాల నాటిది. ఆ సమయంలో ఇక్కడ మెహర్‌గఢ్‌ ఉండేది. ఇది సింధు లోయ నాగరికతలో ఒక ప్రధాన నగరం.

దాదాపు 3 వేల సంవత్సరాల క్రితం సింధు లోయ నాగరికత ముగిసినప్పుడు, ఇక్కడి ప్రజలు సింధ్‌, పంజాబ్‌ ప్రాంతాలలో స్థిరపడ్డారు. దీని తరువాత ఈ నగరం వేద నాగరికత ప్రభావానికి లోనైంది.ఇక్కడ హిందువుల ప్రధాన శక్తి పీఠాలలో ఒకటి ? హింగ్లాజ్‌ మాతా ఆలయం, దీనిని పాకిస్తాన్‌లో నాని కా హజ్‌ అని కూడా పిలుస్తారు. కాలక్రమేణా ఈ నగరం బౌద్ధమతానికి ప్రధాన కేంద్రంగా కూడా మారింది. ఏడవ శతాబ్దంలో అరబ్‌ ఆక్రమణదారులు ఈ ప్రాంతంపై దాడి చేసినప్పుడు, ఇక్కడ ఇస్లాం ప్రభావం పెరిగింది. బలూచిస్తాన్‌ పాకిస్తాన్‌లో అతిపెద్ద రాష్ట్రం, దాని భూభాగంలో 44 శాతం ఆక్రమించింది. జర్మనీ పరిమాణంలో ఉన్నప్పటికీ, దాని జనాభా కేవలం 15 మిలియన్లు, ఇది జర్మనీ కంటే 70 మిలియన్లు తక్కువ. బలూచిస్తాన్‌ చమురు, బంగారం, రాగి మరియు ఇతర గనులతో సమృద్ధిగా ఉంది. ఈ వనరులను ఉపయోగించడం ద్వారా పాకిస్తాన్‌ తన అవసరాలను తీర్చుకుంటుంది. అయినప్పటికీ, ఈ ప్రాంతం అత్యంత వెనుకబడిరది. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్‌పై ద్వేషం పెరగడానికి ఇదే కారణం. పాకిస్తాన్‌ ఆక్రమణ తర్వాత బలూచిస్తాన్‌లో ఐదు ప్రధాన తిరుగుబాట్లు జరిగాయి. ఇటీవలి తిరుగుబాటు 2005లో ప్రారంభమై నేటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ సహా మిగతా దేశాల మద్దతును కూడదీసుకుని.. పాకిస్తాన్‌ పాలకుల్ని కార్నర్‌ చేయాలన్నది బీఎల్‌ఏ స్కెచ్చులా కనిపిస్తోంది. ఈ పాచిక కనుక పారితే.. ఆసియా ఖండంలో కొత్త దేశంగా బెలూచిస్తాన్‌ జెండా ఎగరడం ఖాయం. ఇది మాత్రం పక్కా..!

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....