Sultan Shahiలో ఘనంగా బాబాసాహెబ్ జయంతి వేడుకలు !

హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఇయ్యాల తెలంగాణ) : భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ 135  జయంతి వేడుకలను పురస్కరించుకొని నవ తరంగిణి సామజిక సాంస్కృతిక యువజన సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పాతబస్తీ సుల్తాన్ షాహిలోని ఆశోక్ పిల్లర్ ప్రాంతంలో బాబాసాహెబ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవతరంగిణి అధ్యక్షులు ఎం. ప్రేమ్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  బాబాసాహెబ్ జయంతి వేడుకల్లో  బిజెపి సీనియర్ నాయకులు, బిజెపి గోల్కొండ జిల్లా ఉపాధ్యక్షులు ఎం. కుమార్, బిజెపి రాష్ట్ర ఎక్జ్యుక్యూటివ్ సభ్యులు పాశం సురేందర్ ముఖ్య అథితులుగా పాల్గొని బాబాసాహెబ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ ఆశయాల కనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని సూచించారు. బాబా సాహెబ్ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేఘ రాణి అగర్వాల్, ధరమ్ తేజ, ఉమేష్ సింఘానియా, పవన్ మిశ్రా, కె. దినేష్, పి. లక్ష్మణ్, బి. కరంజయ, జె.మహేష్, సునీల్ తివారి, నరేష్ అవస్తి, అశోక్ సైన్, అనీల్ బజాజ్, ఏ. పద్మ, మంజుల, జి. లక్ష్మణ్, టి. ప్రవీణ్, డి. దేవానంద్, యూ. రాకేష్, పి. సుశీల్, పి. శైలజ, దయానంద్, జి. రాజేందర్ పాల్, రాజు తివారి, సి. శ్రీనివాస్, ఏ. నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....