👉 మహాలక్ష్మీ పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2 వేల 500 ఆర్థిక సాయం
👉 రూ.500 లకే గ్యాస్ సిలిండర్
👉 ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం
👉 ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
👉 ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం
👉 కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం
👉 చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్
రంగారెడ్డి సెప్టెంబర్ 17
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో ఆ పార్టీ ఆరు గ్యారెంటీ హావిూలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ హావిూలను ప్రకటించారు.తెలంగాణలో రానున్నఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా దూసుకెళ్తున్న కాంగ్రెస్ మహిళా ఓటర్లే మెయిన్ టార్గెట్ గా మెజారిటీ హావిూలు ప్రకటించచింది .ఆరు గ్యారంటీ హావిూలతో పాటు సోనియాగాంధీ ప్రకటించిన మొత్తం ప్రకటించిన హావిూల లిస్టు ఇదే.
కీలక ప్రకటనలు ఇవే
మహాలక్ష్మీ పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2 వేల 500 ఆర్థిక సాయం
రూ.500 లకే గ్యాస్ సిలిండర్
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం
ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం
రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం
వ్యవసాయం కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్
గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు
చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్
రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు
తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రకటిస్తోందని తెలిపారు. రైతు భరోసా పథకాన్ని మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
’’రైతు భరోసా కింద రూ.15 వేలు పెట్టుబడి సాయం. కౌలురైతులకు రూ.12 వేలు సాయం. వరికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్. వరి పంటకు క్వింటాల్కు రూ.500 బోనస్. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ప్రజా సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశాం. ఉపాధిహావిూ చట్టం చేసింది కాంగ్రెస్సే. ఆహార భద్రత చట్టం చేసి ప్రజల ఆకలి తీర్చింది కాంగ్రెస్.’’ అని ఖర్గే అన్నారు.