Telangana రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా జన్వాడ ఫామ్‌ హౌస్‌

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అంశం తెరపైకి వస్తోంది. బుధవారం జన్వాడ ఫామ్‌ హౌస్‌ అంశం హాట్‌ టాపిక్‌ అయింది. కొద్ది రోజులుగా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చెరువు శిఖం భూముల్లో కట్టిన నిర్మాణాలను వరుసగా కూల్చూతూ పోతున్నారు. ఈ క్రమంలో బుధవారం కూల్చబోయేది జన్వాడలోని కేటీఆర్‌ ఫామ్‌ హౌసేనని  విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ప్రదీప్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ నేత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన ఫామ్‌ హౌస్‌ కూల్చే ప్రయత్నంలో ఉన్నారని అడ్డుకోవాలని కోరారు. అదే సమయంలో  తెలంగాణ భవన్‌ లో విూడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్‌ తనకు ఎలాంటి ఫామ్‌ హౌస్‌లు లేవని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్‌ హౌస్‌ లీజుకు మాత్రమే తన మిత్రుని వద్ద తీసుకున్నానన్నారు. రేవంత్‌ రెడ్డి  కాంగ్రెస్‌ పార్టీ నేతగా ఉన్న సమయంలో.. పీసీసీ అధ్యక్షుడిగా కూడా నియమితులు కాక ముందు ఓ సారి సంచలన ప్రకటన చేశారు. విూడియాను తీసుకెళ్లి ఓ అద్భుతం చూపిస్తానన్నారు. అలా విూడియా ప్రతినిధల్ని తీసుకుని జన్వాడ గ్రామం వద్దకు వెళ్లారు. అక్కడ ఫామ్‌ హౌస్‌ ను విూడియా ప్రతినిధులకు చూపించారు. పోలీసులకు దగ్గరకు వెళ్లనీయకపోవడంతో.. అక్కడ డ్రోన్‌ ఎగురవేసి ఆ దృశ్యాలను విూడియా ప్రతినిధులకు చూపించారు. ఆ ఫామ్‌ హౌస్‌ కేటీఆర్‌దేనని ఆరోపించారు. 

అయితే అలా డ్రోన్‌ ఎగురవేసినందుకు ఆయనపై అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేసు పెట్టి జైలుకు పంపింది. చాలా రోజుల తర్వాత రేవంత్‌ రెడ్డికి బెయిల్‌ వచ్చింది. తర్వాత రేవంత్‌ రెడ్డి ఆ ఫామ్‌ హౌస్‌ నిబంధనలకు విరుద్ధంగా కట్టారని గ్రీన్‌ ట్రిబ్యూనల్‌లోనూ పిటిషన్‌ వేశారు. అప్పట్లోనే కేటీఆర్‌ ఆ ఫామ్‌ హౌస్‌ తనది కాదని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్‌  మాత్రం..  ఆ ఫామ్‌ హౌస్‌ కేటీఆర్‌దేనని.. కొన్ని భూములు ఆయన భార్య శైలిమ పేరుపై ఉంటే.. మరికొన్ని  బినావిూల పేరుపై ఉన్నాయని ఆరోపిస్తున్నాయి.జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్‌ పేరు విూద ఎలాంటి భూములు లేవు. కానీ ఆయన భార్య శైలిమ పేరు విూద కొన్ని భూములు ఉన్నాయి. ఫామ్‌ హౌస్‌ ఉన్న భూమి ప్రదీప్‌ రెడ్డి అనే వ్యక్తి పేరు విూద ఉంది. ఆ చుట్టుపక్కల కూడా మరికొంత మంది ఇతర వ్యక్తులు కొనుగోలు చేశారు. అయితే వీరంతా కేటీఆర్‌ బినావిూలని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణ. జన్వాడ ఫామ్‌ హౌస్‌  తనది కాదని కేటీఆర్‌ చెబుతున్నారు. 

కానీ కేటీఆర్‌ తరచూ అక్కడకు వెళ్తూంటారు. పార్టీ నేతలతో ఆంతంగిక సమావేశాలు నిర్వహిస్తూంటారు. ఆయన అధీనంలోనే ఫామ్‌ హౌస్‌ ఉందని రాజకీవర్గాలకు తెలుసు. అందుకే కేటీఆర్‌..తాను లీజుకు తీసుకున్నానని చెబుతున్నారు. అయితే కేటీఆర్‌ బుకాయిస్తున్నారని లీజుకు తీసుకుంటే.. ఆ పత్రాలు , బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు బయట పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై బీఆర్‌ఎస్‌ స్పందించాల్సి ఉంది. జన్వాడ ఫామ్‌ హౌస్‌ అత్యంత విలాసవంతంగా ఉంటుంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఫామ్‌ హౌస్‌పై డ్రోన్‌ ఎగురవేసినందుకు రేవంత్‌ రెడ్డి జైలుకెళ్లారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు అత్యంత ఆదునికమైన డ్రోన్లను ఎగురవేసి పూర్తి స్థాయిలో దృశ్యాలు చిత్రీకరించి విూడియాకు ఇస్తున్నారు. అక్కడ నాలాలను కబ్జా  చేశారని..అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.  కేటీఆర్‌ వినియోగిస్తున్న విల్లా అత్యంత విలాసంగా నిర్మించారని అంటున్నారు. ఈ ఫామ్‌ హౌస్‌ వివాదం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కూలగొట్టేందుకు హైడ్రాకు .. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడం వల్ల.. ఏ క్షణమైనా ఆ ఫామ్‌ హౌస్‌ పై  బుల్డోజర్లు దాడి చేయవచ్చని అంటున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....