Telangana రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు !

రేవంత్‌ రెడ్డి

కేబినెట్‌లో ఏడెనిమిది మందికి చోటు..!

హైదరాబాద్‌, జులై 02 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్‌ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు.సోమవారం గవర్నర్‌ తో సమావే శమైన సీఎం రేవంత్‌ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్‌ విస్తరణతో పాటు శాఖల మార్పుకు అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టా నంతో చర్చలు జరిపారు. నేడు  హస్తినలో ఫైనల్‌ లిస్ట్‌ పై కసరత్తు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరెవరికి మంత్రి వర్గంలో అవకాశం లభిస్తుందన్నది ఉత్కంఠ కల్గిస్తోంది. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా, మరో ఏడెనిమిది మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. సామాజిక సవిూకర ణాల ఆధారంగా నాలుగు మంత్రి పదవులకు ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి రెండు, వెలమలకు ఒకటి, బీసీలకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....