TS కాదు..TG : CM రేవంత్‌ రెడ్డి క్లారిటీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి  శుక్రవారం అసెంబ్లీలో  కీలక ప్రకటన చేశారు. ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదని భావిస్తున్నామని.. అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని అందుకే చిహ్నం మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీడీ అని రాసుకునేవాళ్లం. వాహనాలు, బోర్డులపై అంతా టీజీ అని రాసుకున్నారు.  కొందరు యువకులు తమ గుండెలపై పచ్చబొట్టు కూడా వేసుకున్నారు. కేంద్రం సైతం తమ నోటిఫికేషన్‌ లో టీజీ అనే పేర్కొంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము రాష్ట్ర అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం. జయజయహే గీతం తెలంగాణ ఉద్యమ సమయంలో అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ పాట రాష్ట్ర గీతం అవుతుందని అంతా భావించినా.. ఆ పాటను నిషేధించినంత పని చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించాం. తెలంగాణ తల్లి అంటే మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తు రావాలి. తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదు. తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలి.’ అంటూ సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు.

గ్రూప్‌ 1 అభ్యర్థుల – వయో పరిమితిని 46 ఏళ్ళు : 

తెలంగాణలో గ్రూప్‌ 1 అభ్యర్థులకు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్‌ 1 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల ుూఖూఅ ప్రక్షాళన ఆలస్యమైందని.. నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జిరాక్స్‌ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్లం కాదని, ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదని అన్నారు.తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ కు ప్రధాన ప్రతిపక్ష బాధ్యత అప్పగించారని.. అయినా ఆ పార్టీ అధినేత అసెంబ్లీకి రాకపోవడం దురదృష్టకరమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 

ఆయన శాసనసభకు వచ్చి తమ ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 9 నాటికి తమ ప్రభుత్వం 2 నెలలు పూర్తి చేసుకుందని.. ఈ కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు వంటి గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు. త్వరలోనే మరో 2 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు వేశామని.. ప్రతిపక్షం సహకరించకున్నా ప్రజా పాలన అందిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలకు ఆందోళన అవసరం లేదని.. ఇచ్చిన హావిూ మేరకు ఉద్యోగాల కల్పన ఉంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ‘త్వరలోనే పోలీస్‌ శాఖలో 15 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యూనివర్శిటీల వీసీల నియామకం కోసం సెర్చ్‌ కమిటీ ఏర్పాటు చేశాం. వర్శిటీల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం. ఇప్పటికే 80 శాతం పెన్షన్లు అందించాం. మిగతా 20 శాతం కూడా 15 రోజుల్లో ఇచ్చి పెన్షనర్లను ఆదుకుంటాం. నియోజకవర్గ సమస్యలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నన్ను కలిస్తే వారిని అనుమానిస్తున్నారు. సీఎంగా అందరినీ కలవడం, వాళ్ల సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత. బీఆర్‌ఎస్‌ పద్ధతిలో నేను చేయను. గతపు ఆనవాళ్లను సమూలంగా ప్రక్షాళన చేసే బాధ్యత నాది.’ అని పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....